టీడీపీ నేతల మాటలు విడ్డూరం

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
 

అమరావతి: టీడీపీ నేతలు విడ్డూరంగా మాట్లాడుతున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. పింఛన్ల పెంపు, ఆశా వర్కర్ల వేతనాల పెంపుపై జరిగిన చర్చలో మంత్రి సమాధానం చెప్పారు.  ఆశా వర్కర్లకు వేతనాలు రూ.10 వేలు పెంచాలని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై త్వరలోనే చెబుతాం. చంద్రబాబు ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ, పింఛన్లు పెంచారు. ఆయన  ఇచ్చిన రుణమాఫీ చేయకుండా అన్నదాత సుఖీభవ అంటూ మోసం చేసిన టీడీపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 
 

తాజా వీడియోలు

Back to Top