తాడేపల్లి: వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాలతో పార్టీలో వరుసగా నూతన నియామకాలు కొనసాగుతున్నాయి. సోమవారం సాయంత్రం మరికొన్ని పోస్టులకు సంబంధించిన ప్రకటనను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా వంకెల పెద్ద పోలిరెడ్డి (బద్వేలు)ని, పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరు పరిశీలకునిగా చిన్న అప్పలనాయుడుని, అలాగే.. అరకు, పాడేరు పరిశీలకులుగా బొడ్డేటి ప్రసాద్ నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల అయ్యింది.