మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
గౌతమన్న మృతిని నేటికీ జీర్ణించుకోలేకపోతున్నా..
28 Mar 2022 1:01 PM
ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్కుమార్ యాదవ్
నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతిచెంది నెలరోజులు అవుతున్నా.. గౌతమన్న లేడన్న మాటను నేటికీ జీర్ణించుకోలేకపోతున్నానని ఇరిగేషన్ శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్రెడ్డి సంస్మరణ సభలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి ఒక సైనికుడిలా గౌతమ్రెడ్డి పనిచేశారని గుర్తుచేశారు. గౌతమ్రెడ్డితో తనకు 12 ఏళ్ల నుంచి స్నేహం ఉందని, నెల్లూరు నుంచి ఇద్దరం మంత్రులుగా కలిసిమెలిసి పనిచేశామని, చిన్న బేధాభిప్రాయాలు లేకుండా ఉన్నామన్నారు. రాజకీయాల్లో ఎప్పుడూ వివాదాల్లోకి వెళ్లలేదు, అందరితో కలిసిమెలిసి పనిచేశారు. గౌతమన్న మరణం రాష్ట్ర ప్రజలతో పాటు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరనిలోటన్నారు.