మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుంది

మంత్రి గుడివాడ అమర్నాథ్‌

విశాఖ: మరో రెండు నెలల్లో విశాఖ పరిపాలన రాజధాని కాబోతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ తెలిపారు. త్వరలోనే ఇన్ఫోసిస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. విశాఖలో రెండో రోజు ఇన్ఫినిటీ వైజాగ్‌ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంత్రి గుడివాడ అమర్నాథ్, ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..దేశంలోనే ధనిక నగరాల్లో విశాఖ తొమ్మిదో స్థానంలో ఉందని తెలిపారు. త్వరలో అదాని డేటా సెంటర్‌ను ప్రారంభిస్తామని చెప్పారు. విశాఖను ఐటీ హబ్‌ చేయడమే మా లక్ష్యమన్నారు.
 

Back to Top