స‌ర్కార్ నుంచి ఒక్క రూపాయి సాయం అంద‌లేదు

వైయ‌స్ జ‌గ‌న్ ఇచ్చిన మాట ప్ర‌కారం ప్రతి హెక్టారుకు రూ 20వేల సాయం అందిస్తాం

క‌డ‌ప ఎంపీ వైయ‌స్ అవినాష్ రెడ్డి స్ప‌ష్టీక‌ర‌ణ‌

పులివెందుల‌: అకాల వర్షాలకు నష్టపోయిన అరటి రైతులను ఆదుకోవడంలో టీడీపీ కూట‌మి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ క‌డ‌ప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మండిప‌డ్డారు. ఇంత వ‌ర‌కు స‌ర్కార్ నుంచి రైతుల‌కు రూపాయి సాయం కూడా అంద‌లేద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. గ‌తంలో నష్టపోయిన పంటలను వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ సీఎం వైయ‌స్ జగన్ పరామర్శించారు. అనాడు వైయస్ఆర్ కాంగ్రెస్ తరపున సాయం చేస్తాను అని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు నష్టపోయిన ప్రతి హెక్టారుకు రూ 20వేల సాయం అందిస్తామ‌ని అవినాష్‌రెడ్డి స్ఫ‌ష్టం చేశారు. గురువారం ఆయ‌న పులివెందుల‌లో మీడియాతో మాట్లాడారు. 

అవినాష్‌రెడ్డి ఏమన్నారంటే..

  • అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప్రభుత్వం నుంచి ఇంతవరకు సాయం అంద‌లేదు. మళ్ళీ మళ్ళీ అకాల వర్షాలకు అరటి దెబ్బతింటూనే ఉంది. ఇటీవల అకాల వర్షాల వల్ల లింగాల మండలంలో ఉద్యాన పంటలు  దెబ్బ‌తిన్నాయి. వెంటనే ప్రభుత్వం రైతులను ఆదుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నాం.
  • అకాల వ‌ర్షాల‌కు న‌ష్ట‌పోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి సుముఖ‌త వ్యక్తం చేశారు. 
  • 630 మంది రైతులకు హెక్టార్ కు 20 వేల చొప్పున వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పరిహారం ఇచ్చేందుకు వైయ‌స్ జ‌గ‌న్‌ ఆమోదం తెలిపారు
  • ఈ పరిహారానికి సంబంధించిన త్వరలోనే ఆయా గ్రామాల వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో రైతులందరికీ డీడీలు అందేలా చూస్తాం
  • 630 మందికి రూ. 1.30 కోట్ల పరిహారాన్ని డీడీల రూపంలో అందజేస్తున్నాం
  • ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాల్సిన అవసరం ఉంది. తన బాధ్యతను గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
  • రూ.26 కోట్లతో అరటి రైతుల కోసం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ని ఏర్పాటు చేసింది 
  • కానీ దాని వినియోగంలోకి తీసుకురావడంలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విఫలమైంది 
  • పులివెందుల పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధితో ఏంటో అర్థం చేసుకోవచ్చు 
  • ఈ కోల్డ్ స్టోరేజ్ని వినియోగంలోకి తీసుకొచ్చి ఉంటే ధరల స్థిరీకరణకు అవకాశం ఉండేది 
  • ధరల స్థిరీకరణ జరిగితే రైతుకు ప్రయోజనం కలిగేది
  • గత నెలలో అరటి ధర ఓ మోస్తారు గా ఉండేది 
  • ఇప్పుడు అరటి ధర పడిపోయి రైతుకు గిట్టుబాటు కావడం లేదు
  •  పులివెందులలో 30 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం జరిగింది 
  • దాన్ని వినియోగంలోకి తీసుకురావడం
  • మెడికల్ కాలేజ్ నిర్మించి 50 సీట్లు మంజూరు అయ్యేలా వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం చేస్తే వచ్చిన సీట్లను వద్దని రాసి పంపించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది
  • వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెర‌డ్డి 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా, కడప నుంచి నాలుగుసార్లు ఎంపీగా, రెండుసార్లు సీఎం గా గెలిచి పులివెందుల ను అభివృద్ధి చేస్తే ఇప్పుడు మెడికల్ కాలేజీకి ఆయన పేరును తీసివేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతుంది .
  • మెడికల్ కాలేజీ మెయిన్ గేట్ కు ఉన్న వైయ‌స్ఆర్ పేరు తొలగిస్తారేమో కానీ ఈ ప్రాంత ప్రజల్లో ఆయనకున్న స్థానాన్ని అయితే చెరిపి వేయలేరు . చేయ‌ని పనులు చేసినట్లు చెప్పుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 
  • ఏ పని ఎవరు చేశారో ప్రజలందరికీ తెలుసు 
  • గండి క్షేత్రంలో రూ. 26 కోట్లతో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తే ..కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న చిన్న చిన్న పనులు చేయలేక అసంపూర్తిగా వదిలేసింది. కూటమి ప్రభుత్వం వచ్చాక జిల్లాలో గంజాయి రవాణా విస్తృతంగా పెరిగిపోయింది. 
  • వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం మద్యపానాన్ని కట్టడి చేస్తే ..ఈ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా వీధికి ఒక మద్యం షాపును తెరిచింది.
Back to Top