వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
సీఎం వైయస్ జగన్ను కలిసిన ఐఎన్టీయూసీ నేతలు
24 Mar 2021 6:48 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కార్మిక సంఘాల నేతలు బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్పరం కాకుండా కాపాడాలని ఆల్ ఇండియా ఐఎన్టీయూసీ ప్రెసిడెంట్ జి. సంజీవరెడ్డి, పలువురు ఐఎన్టీయూసీ నేతలు సీఎం వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కును కాపాడుకోవాలని, ప్రైవేటీకరణ జరిగితే కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని నేతలు సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. సస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని ముఖ్యమంత్రికి ఐఎన్టీయూసీ నేతలు వినతిపత్రం అందజేశారు.