రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
గుడివాడలో `హౌస్ ఫర్ ఆల్` ప్రారంభం
05 Aug 2020 12:58 PM
కృష్ణా: ఇళ్ల పథకంలో రివర్స్టెండరింగ్ ద్వారా రూ.200 కోట్లు ఆదా చేశామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో పేదలకు నిర్మిస్తున్న `హౌస్ ఫర్ ఆల్` పథకం పనులను మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంలో కూడా అవినీతికి పాల్పడిందన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ సర్కార్ ప్రతీ పథకం పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలు న్యాయస్థానాలకు వెళ్లడం వల్ల పేదలకు సకాలంలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయామన్నారు. న్యాయస్థానం అనుమతులిస్తే స్వాతంత్ర్య దినోత్సవం రోజున (ఆగస్టు 15) పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలు అందించడానికి ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి కొడాలి నాని చెప్పారు.