ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జెడ్పీ చైర్పర్సన్లు
30 Sep 2021 6:17 PM
తాడేపల్లి: గుంటూరు, కృష్ణా జిల్లాల పరిషత్ చైర్పర్సన్లుగా నూతనంగా ఎన్నికైన కత్తెర హెనీ క్రిస్టినా, ఉప్పాల హారిక ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ను గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు జెడ్పీ చైర్పర్సన్గా అవకాశమిచ్చినందుకు ముఖ్యమంత్రి వైయస్ జగన్కు కత్తెర హెనీ క్రిస్టినా కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఉప్పాల హారిక సీఎం వైయస్ జగన్ను మర్యాదపూర్వకంగా కలిసి.. కృతజ్ఞతలు తెలిపారు. ఉప్పాల హారిక వెంట కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఉన్నారు.