స్వస్థలాలకు వలస కార్మికులు

ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల జారీ!

1902 ఫోన్ నంబరుకు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి

గ్రీన్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి

తాడేపల్లి:  లాక్‌డౌన్‌ కారణంగా చిక్కుకున్న వలస కూలీలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే, అధికారులకు పలు కీలక సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని జిల్లాల్లో చిక్కుకున్న కూలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సూచనలు చేసింది.

  • రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న కార్మికులు 1902 ఫోన్ నంబరుకు కాల్ చేయాలి
  • వలస కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి
  • గ్రీన్‌ జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి
  • శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ర్యాండమ్‌గా పరీక్షలు
  • పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సుల్లో తరలించాలి
  • బస్సుల్లో 50 శాతానికి మించకుండా తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు
  • స్వగ్రామానికి చేరుకున్న అనంతరం కూలీలు అక్కడ మరోసారి 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి
  • అనంతరం మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలి
  • ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ బృందం మొత్తాన్ని అక్కడే ఉంచాలి
  • పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి
  • ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి
  • ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలి
Back to Top