అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
స్వస్థలాలకు వలస కార్మికులు
02 May 2020 11:35 AM
ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాల జారీ!
1902 ఫోన్ నంబరుకు కాల్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి
గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి
తాడేపల్లి: లాక్డౌన్ కారణంగా చిక్కుకున్న వలస కూలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే, అధికారులకు పలు కీలక సూచనలు చేసింది. ఇతర రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని జిల్లాల్లో చిక్కుకున్న కూలీలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కూలీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ సూచనలు చేసింది.
- రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో చిక్కుకున్న కార్మికులు 1902 ఫోన్ నంబరుకు కాల్ చేయాలి
- వలస కార్మికులు తమ వివరాలు నమోదు చేసుకోవాలి
- గ్రీన్ జోన్ నుంచి గ్రీన్ జోన్లకు మాత్రమే రాకపోకలకు అనుమతి
- శిబిరాల నుంచి స్వగ్రామాలకు వెళ్లాలనుకునే వారికి ర్యాండమ్గా పరీక్షలు
- పరీక్షల్లో నెగిటివ్ వస్తే వారిని బస్సుల్లో తరలించాలి
- బస్సుల్లో 50 శాతానికి మించకుండా తరలించాలని ప్రభుత్వం ఆదేశాలు
- స్వగ్రామానికి చేరుకున్న అనంతరం కూలీలు అక్కడ మరోసారి 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి
- అనంతరం మరో 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉండాలి
- ఎవరికైనా పాజిటివ్ వస్తే ఆ బృందం మొత్తాన్ని అక్కడే ఉంచాలి
- పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి
- ఇతర రాష్ట్రాల్లో ఉన్న వారి గురించి అధికారులు ఆయా రాష్ట్రాల అధికారులతో మాట్లాడాలి
- ఆయా రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాలి