మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
వైయస్ జగన్ మీ బిడ్డ.. రైతుల తరఫున నిలబడే బిడ్డ
08 Jun 2022 11:44 AM
‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మీ బిడ్డ, రైతుల తరఫున నిలబడే బిడ్డ అని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి అన్నారు. గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడుతూ.. మన జగనన్నలో నిజాయితీ ఉంది, నిబద్ధత ఉంది. ఏది చెబుతాడో అదే చేస్తాడని అన్నారు. ఎన్నికలప్పుడు ఒకలా? ఎన్నికలైన తర్వాత మరో మాదిరిగా ఉండేవాడు కాదని అన్నారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శింగనమల నియోజకవర్గంలో దిగ్విజయంగా సాగిపోతోంది. ఎమ్మెల్యే వెంట అధికారులు కూడా ఉండటంతో సమస్యలేమైనా ఉంటే అక్కడికక్కడే వారితో మాట్లాడుతూ, ఒక బుక్ లో నోట్ చేసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. అలాగే జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకున్న వైనాన్ని తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా విద్యార్థుల చదువులను ఆరా తీస్తున్నారు.
ఇలా ఎమ్మెల్యే తనదైన శైలిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ముందుకు సాగిపోతున్నారు. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చి హడావుడి చేసి, మళ్లీ ఐదేళ్ల వరకు కనిపించని నాయకులనే చూశాంగానీ, ఇలా ప్రజల ముందుకు వచ్చి ఇంకా ఏం కావాలి? అని అడుగుతున్న ప్రజా ప్రతినిధులను వైయస్ఆర్ సీపీ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.