వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నా కుటుంబంలోకి వచ్చినట్లుగా ఉంది
14 Mar 2019 2:35 PM
మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసల పర్వం కొనసాగుతోంది. మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి, గురురాఘవేంద్ర సంస్థల చైర్మన్ దస్తగిరి రెడ్డి వైయస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. లోటస్పాండ్లోని పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ నివాసంలో కలిసిన లబ్బి వెంకటస్వామి, దస్తగిరిరెడ్డిలు జననేత సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు లబ్బి వెంకటస్వామి మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ జగన్ సీఎం అయితేనే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలను చంద్రబాబు రాజకీయంగా అణగదొక్కుతున్నారన్నారు. నియంతృత్వ పోకడ జరుగుతుందని, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి నందికోట్కూరు నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న తనను తప్పించి గౌరు వెంకటరెడ్డికి సంబంధించిన వారికి ఇచ్చారని మండిపడ్డారు. వైయస్ జగన్ నేతృత్వంలో పనిచేయడం చాలా సంతోషంగా ఉందని, వైయస్ఆర్ సీపీలోకి వస్తే నా కుటుంబంలోకి నేను వచ్చినట్లుగా ఉందన్నారు.