చంద్ర‌బాబును చూసి ఎస్సీ, ఎస్టీలు అస‌హ్యించుకుంటున్నారు

మంత్రులు పుష్పశ్రీవాణి, తానేటి వనిత

విజయవాడ:  ఎస్సీలుగా పుట్టాలనుకుంటారా అంటూ అవమానించిన చంద్రబాబు, ఎస్టీలకు తెలివి ఉండదని  హేళన చేశారని.. ఆయనను చూసి ఎస్సీ, ఎస్టీలు అసహ్యించుకుంటున్నారని డిప్యూటీ సీఎం పుష్ప‌శ్రీ‌వాణి అన్నారు. ఎస్సీ, ఎస్టీల గురించి మాట్లాడే అర్హత ప్రతిపక్ష నేత చంద్రబాబుకు లేదని   పుష్పశ్రీవాణి నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీలకు ఎవరూ ఇవ్వనన్నీ పథకాలు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అమలు చేస్తున్నార‌ని పేర్కొన్నారు. కోటి 13 లక్షల మందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం వైయ‌స్‌ జగన్‌దే. ఎస్సీ, ఎస్టీలకు ఏడాదిలోనే 13వేల కోట్లు సంక్షేమ పథకాల రూపంలో అందించాం. దళితులు, గిరిజనులపై దాడులు జరిగితే వెంటనే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.

ద‌ళితుల‌పై బాబు మొస‌లి క‌న్నీరు: మ‌ంత్రి తానేటి వ‌నిత‌

 చంద్రబాబు దళిత ద్రోహి అని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు. ఏనాడూ దళితులను ఆయన పట్టించుకోలేదన్నారు. దళితులపై చంద్రబాబు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. సీఎం వైయ‌స్ జగన్‌ కేబినెట్‌లో ఐదుగురు దళితులకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు దళితులు గుణపాఠం చెబుతారని తానేటి వనిత హెచ్చ‌రించారు.

Back to Top