చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు
04 Apr 2020 3:15 PM
పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాలను రెడ్జోన్గా ప్రకటించాలి
వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో మంత్రి ఆళ్ల నాని
ఏలూరు: కరోనా పాజిటివ్ వచ్చినవారి కుటుంబ సభ్యులు పోలీసులు, వైద్య సిబ్బందికి సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని హెచ్చరించారు. ఏలూరు మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైద్య, ఆరోగ్య, పోలీస్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్కు తరలించాలని సూచించారు. పోలీస్, మెడికల్ టీమ్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, పాజిటివ్ కేసు వచ్చిన ప్రాంతాన్ని రెడ్జోన్గా ప్రకటించాలని సూచించారు. నాలుగు జోన్లలో ఒక్కొక్క జోన్కు స్పెషల్ ఆఫీసర్ను నియమించాలని, రెడ్జోన్ ప్రాంతంలో ప్రజలు బయటకు రాకుండా చూడాలన్నారు. సర్వేలైన్స్కు ప్రత్యేక టీమ్స్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏలూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా సర్వేలైన్స్ టీమ్ ఏర్పాటు చేయాలన్నారు. ఏలూరు కార్పొరేషన్లోని రెడ్జోన్ ప్రాంతంలో శానిటేషన్ చేయించాలని, రెడ్జోన్ ప్రాంతంలో పూర్తిగా సర్వే చేయాలని ఆదేశించారు.