మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సీఎం వైయస్ జగన్ పాలన దేశానికే ఆదర్శం
24 Sep 2022 12:00 PM
కడప నగరంలో `గడప గడపకూ మన ప్రభుత్వం`లో పాల్గొన్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా
కడప: సంక్షేమ పథకాల అమలులో వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్ బాషా అన్నారు. సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ, నాడు-నేడు వంటి వాటిని ఇతర రాష్ట్రాలు సైతం ఫాలో అవుతున్నాయని చెప్పారు. వైయస్ఆర్ జిల్లా కడప నగరంలోని 9వ డివిజన్ ఎన్జీవో కాలనీలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇంటింటికీ తిరిగి నవరత్నాల పథకాల గురించి ప్రజలకు వివరించారు. పథకాలు అందుతున్నాయా.. లేదా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. రూపాయి లంచం లేకుండా సంక్షేమ పథకాలన్నీ ప్రతీ ఇంటికీ అందుతున్నాయని ప్రజలంతా ముక్తకంఠంతో చెబుతున్నారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో కడప మేయర్ సురేష్బాబు, డివిజన్ కార్పొరేటర్, కడప నగర మహిళా అధ్యక్షురాలు వెంకటసుబ్బమ్మ, ప్రజా ప్రతినిధులు, అధికారులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.