ప్రతి గడపకు సమయం కేటాయించాలి

 ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వకర్తలకు సీఎం వైయస్‌ జగన్‌ సూచన
 

తాడేపల్లి: ప్రతి గడపకు సమయం కేటాయించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సూచించారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. గడప గడపకు వెళ్లే సమయంలో ప్రజల నుంచి వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని సీఎం సూచించారు. ప్రజా సమస్యలను ఎక్కడా నిర్లక్ష్యం చేయొద్దని తెలిపారు. గ్రామ, వార్డు సచివాయాల్లో మరింత సమయం గడపాలన్నారు.
 

Back to Top