రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ విశాఖపట్నం, గుంటూరు జిల్లాల పర్యటన

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు(14.12.2022) విశాఖ‌, గుంటూరు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం దాకమర్రి జంక్షన్‌ వద్ద నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు సీఎం హాజ‌రు కానున్నారు.  అనంతరం గుంటూరు జిల్లా మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్  హాజర‌వుతారు. 
మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 4 గంటలకు దాకమర్రి చేరుకుని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు కుమారుడి వివాహ వేడుకకు హాజరుకానున్న సీఎం, అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కుమార్తె వివాహ వేడుకకు హాజరు కానున్న సీఎం, ఆ తర్వాత తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Back to Top