పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
గ్రామాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం
16 Mar 2021 5:02 PM
ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం
నిర్ణీత సమయంలోగా అర్హులకు ఇంటిస్థలం పట్టా అందాలి
ఇళ్ల నిర్మాణ సన్నాహక పనులను ముమ్మరం చేయాలి
ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభించనున్నాం
మల్టీపర్పస్ సెంటర్ల కోసం వీలైనంత త్వరగా భూములు గుర్తించాలి
ప్రీ ప్రైమరీ స్కూల్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాం
గ్రామ, వార్డు వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి
కలెక్టర్లు, ఎస్పీలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశం
తాడేపల్లి: ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించామని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. మార్చి 15 నాటికి 2427 లక్షల పనిదినాలు కల్పించామని, 2,525 పనిదినాలు ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ఇవ్వగలిగామని, దాదాపు రూ.6వేల కోట్లు ఉపాధి హామీ కింద కూలీలకు ఇవ్వగలిగామని, ఇందుకు సహకరించిన కలెక్టర్లందరికీ సీఎం అభినందనలు తెలిపారు. స్పందన కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏప్రిల్ మాసంలో సంక్షేమ పథకాలు..
2021 ఏప్రిల్ నెలలో అమలు చేయబోతున్న సంక్షేమ పథకాలను సీఎం వైయస్ జగన్ ప్రకటించారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన, ఏప్రిల్ 13న వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభం, 16న రైతులకు వైయస్ఆర్ సున్నావడ్డీ డబ్బులు, 20న డ్వాక్రా మహిళలకు వైయస్ఆర్ సున్నావడ్డీ డబ్బులు, ఏప్రిల్ 27న జగనన్న వసతి దీవెన కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
ఉపాధి హామీ పనులు, ఇళ్లపట్టాలు, స్కూళ్లు, అంగన్వాడీ సెంటర్లలో నాడు – నేడు, మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్కాలేజీలు, ఆర్ అండ్ బి, వైయస్ఆర్ బీమా, జగన్నతోడు, వైయస్ఆర్ చేయూత, వైయస్ఆర్ ఆసరా ప్రగతి, రబీ–2020, ఖరీఫ్–2021 పంటల కొనుగోళ్లు, జగనన్న విద్యా దీవెన , వలంటీర్లకు సత్కారం, వైయస్ఆర్ సున్నా వడ్డీ రైతులకు, వైయస్ఆర్ సున్నా వడ్డీ స్వయం సహాయ సంఘాలకు, జగనన్న వసతి దీవెన కార్యక్రమాలపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు.
సీఎం వైయస్ జగన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే..
‘ఎన్నికలు కారణంగా చాలా రోజులుగా కలెక్టర్లతో సమావేశం కాలేకపోయాను. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉంది. అదికూడా ముగిస్తే.. ఇక వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టిపెట్టే అవకాశం ఉంటుంది.
నిర్మాణ పనులు వెంటనే పూర్తిచేయాలి..
యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తిచేయాలి. మే, 2021 నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలి. అలాగే ఆర్బీకేలను పూర్తి చేయడంపైన దృష్టిపెట్టాలి. ఆర్బీకేల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే వైయస్ఆర్ హెల్త్క్లినిక్స్ను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలి. వీటన్నింటిపైనా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..
అమూల్ సంస్థతో కలసి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టాం. పాల రైతులకు మంచి ధర వచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బీఎంసీ, ఏంఎంసీల నిర్మాణాలపైనా దృష్టిపెట్టాలి. నెలాఖారు కల్లా అన్ని ప్రాంతాల్లో బీఎంసీ, ఏంఎంసీల నిర్మాణం మొదలుపెట్టాలి, ఆగస్టుకల్లా పూర్తిచేయాలి. ఉపాధిహామీ కింద మొదలుపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్స్ను వెంటనే పూర్తిచేయాలి.
11,334 మందికి పట్టాలు వెంటనే అందించాలి
అక్కడక్కడా మిగిలిపోయిన ఇళ్లపట్టాల పంపిణీని పూర్తిచేయాలి. అలాగే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి 90 రోజుల్లోగా పట్టాలు ఇవ్వాలి. కచ్చితంగా నిర్ణీత సమయంలోగా అర్హులైన వారికి ఇంటిస్థలం పట్టా అందాలి. కొత్తగా అర్హులుగా గుర్తించిన 11,334 మందికి పట్టాలను కూడా వెంటనే అందించాలి. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్ కూడా పూర్తిచేయాలి. ఏప్రిల్ నుంచి వీరికి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టిపెట్టాలి.
ప్రతి కాలనీలో ఒక మోడల్ హౌస్ కట్టాలి..
తొలివిడతలో 15.60లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించిన అన్నిరకాల ప్రక్రియలను పూర్తిచేయాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను ముమ్మరం చేయాలి. లే అవుట్లలో నీళ్లు, కరెంటును వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్ 15 కల్లా ఈ లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ప్రతి కాలనీలో ఒక మోడల్హౌస్ కట్టాలి. తామే ఇళ్లు కట్టుకుంటామన్న వారికి నిర్మాణ సామగ్రిని అందించాలి. పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలు చేస్తున్నందున లబ్దిదారులకు తక్కువ ధరకు సిమెంటు, స్టీలు, మెటల్ లాంటి నిర్మాణ సామగ్రి లభిస్తుంది, వారికి మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు, వలంటీర్లు.. ఇలా వీరి సేవలను వాడుకోవాలి.
నాడు – నేడు
‘మొదటి విడత స్కూళ్లలో మార్చి 31 నాటికి పనులు పూర్తికావాలి. 10 రకాల సదుపాయాల నాడు – నేడు కింద స్కూళ్లకు సమకూరుతున్నాయి.పెయింట్ పనులపై కాస్త దృష్టిపెట్టాలి. వైయస్ఆర్ ప్రీ ప్రై మరీ స్కూల్స్ కింద అంగన్వాడీల్లో కూడా నాడు–నేడు పనులు చేపడుతున్నాం. 6 ఏళ్లలోపు వయసులో 80 శాతం వరకూ మెదడు అనేది అభివృద్ది చెందుతుంది. అందుకనే ఈ వయసులో ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రీ ప్రైమరీ స్కూల్స్ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కొన్ని చోట్ల భవనాల నిర్మాణకోసం స్థలాలపై దృష్టిపెట్టాలి. అంగన్వాడీలకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు దృష్టిపెట్టాలి.
రైతులకు మంచి ధర రావాలంటే..
ఆర్బీకేల పరిధిలో మల్టీపర్పస్ సెంటర్లను పెడుతున్నాం. మల్టీపర్పస్ సెంటర్లకోసం 50 సెంట్ల నుంచి ఒక ఎకరం స్థలం వరకు కావాలి. వీలైనంత త్వరగా భూములను గుర్తించి సంబంధిత శాఖకు అప్పగించాలి. గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్ ఫ్లాట్ ఫాంలాంటి సదుపాయాలు గ్రామాల స్థాయి వరకూ రావాలి. రైతులకు మంచి ధరలు రావాలంటే.. ఈ సదుపాయలు రావాలి. రెండో స్థాయిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 10–15 ఎకరాల భూమిని గుర్తించాలి. ఫుడ్ ప్రాససింగ్ కోసం ఈ భూమిని వినియోగిస్తాం.
మెడికల్కాలేజీల నిర్మాణం
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్ కాలేజీని తీసుకువస్తున్నాం. బోధనాస్పత్రితో పాటు నర్సింగ్ కాలేజీ కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కాలేజీలకు భూములను గుర్తించి, వాటిని సేకరించే పనులు పూర్తిచేయాలి. పులివెందుల, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, ఆధోని, మచిలీపట్నంల్లో ఆరు చోట్ల ముందస్తుగా నిర్మాణాలు ఏప్రిల్లో మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలి. దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి. ప్రత్యేక సెల్ను ఏర్పాటుచేయాలి.
ఏప్రిల్ 13న వలంటీర్లను సత్కరించే కార్యక్రమం
ఏప్రిల్ 13న వలంటీర్లను సత్కరించే కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. ప్రతి రోజు ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు వెళ్లాలి. వలంటీర్లను సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పేర్లతో సత్కరించాలి. వలంటీర్లు అందిస్తున్న సేవలను గుర్తించాలి’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు.