చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
నేడు ఇడుపులపాయకు సీఎం వైయస్ జగన్
01 Sep 2021 11:08 AM
2వ తేదీన మహానేత వైయస్సార్కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి
తాడేపల్లి: సీఎం వైయస్ జగన్ నేడు వైయస్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5 గంటలకు ఇడుపులపాయలోని వైయస్సార్ ఎస్టేట్కు చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడతారు. రాత్రి అక్కడి గెస్ట్హౌస్లో బస చేయనున్నారు.
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని 2వ తేదీ గురువారం ఉ.9.35 గంటలకు వైయస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.