నేడు ఇడుపులపాయకు సీఎం వైయ‌స్‌ జగన్‌

2వ తేదీన మహానేత వైయ‌స్సార్‌కు నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి

తాడేప‌ల్లి: సీఎం వైయ‌స్‌ జగన్ నేడు వైయ‌స్ఆర్ జిల్లా ఇడుపులపాయకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి కడపకు బయల్దేరుతారు. 5 గంటలకు ఇడుపులపాయలోని వైయ‌స్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడతారు. రాత్రి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేయనున్నారు. 
తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని 2వ తేదీ గురువారం ఉ.9.35 గంటలకు వైయ‌స్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పిస్తారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం పార్టీ నాయకులతో మాట్లాడి.. తిరిగి అక్కడి నుంచి బయల్దేరి, మధ్యాహ్నం 12.45కు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.   

Back to Top