తాడేపల్లి: కరోనా వైరస్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమీక్షా సమావేశం ప్రారంభమైంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యాక్సినేషన్పై మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల కొనసాగింపు, పరీక్షలపై సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యులు హాజరయ్యారు.