వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
వలస కూలీల పరిస్థితిని చూసి చలించిపోయిన సీఎం
16 May 2020 3:14 PM
ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం
వలస కూలీల కోసం బస్సులు తిప్పేందుకు సిద్ధం కావాలి ఆదేశం
తాడేపల్లి: లాక్డౌన్ నేపథ్యంలో నడుచుకుంటూ తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్న వలస కూలీల సరిస్థితిని చూసి ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి చలించిపోయారు. వలస కూలీల పట్ల ఉదారంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల వలస కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. మానవీయ కోణాన్ని మరచిపోవద్దంటూ అధికారులకు సూచించారు. వలస కూలీల కోసం బస్సులు తిప్పేందుకు సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు. అందుకోసం విధివిధానాలను తయారు చేయాలని సూచించారు. ఏపీ గుండా నడిచి వెళ్తున్న వలస కూలీలపై ఉదారత చూపాలని, నడిచివెళ్తున్న కూలీలు ఎక్కడ తారసపడ్డ వారిని బస్సుల్లో ఎక్కించి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉచితంగా తీసుకెళ్లాలని వైయస్ జగన్ సూచించారు. వలస కూలీలను టికెట్లు కూడా ఆడగవద్దని సీఎం వైయస్ జగన్ అధికారులకు సూచించారు.