తాడేపల్లి: చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకు తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణ చేపడుతామని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్.జగన్ సమావేశం నిర్వమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో సీఎం వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్కు బిషప్లు, రెవరెండ్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను తీసుకొచ్చారు. చర్చిల ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు. ఛారిటీ సంస్ధలు నడుపుతున్నవారికి... స్ధానిక పన్నుల నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు.
- క్రైస్తవ సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించిన సీఎం.
- చర్చిలు, వాటి ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చిన సీఎం.
- జిల్లా స్దాయిలో సమస్యల పరిష్కారానికి సీఎం హామీ.
- ఎస్పీ, కలెక్టర్లు జిల్లా స్ధాయిలో సమస్యల పరిష్కరిస్తారన్న సీఎం.
- ఇకపై క్రిస్టియన్ సమాజం, సంఘాల ప్రతినిధుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించేందుకు ఒక సలహాదారును నియమిస్తామన్న సీఎం.
- తద్వారావారి సమస్యలను సులభంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందన్న సీఎం.
- క్రిస్టియన్లకు స్మశానవాటికలు ఏర్పాటుపైనా సానుకూలంగా స్పందించిన సీఎం.