విశాఖ బయల్దేరిన సీఎం వైయస్‌ జగన్‌

తాడేపల్లి: శ్రీశారదా పీఠం వార్షిక మహోత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నం బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం వైయస్‌ జగన్‌.. గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు బయల్దేరారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన శ్రీశారదా పీఠానికి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు శ్రీ శారదా పీఠంలోని పలు కార్యక్రమల్లో పాల్గొంటారు. 
 

Back to Top