కొన‌సాగుతున్న కేబినెట్ భేటీ

స‌చివాల‌యం: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ప్రారంభ‌మైంది. స‌చివాల‌యంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో  ఉదయం 11 గంటలకు మంత్రిమండ‌లి స‌మావేశం ప్రారంభ‌మైంది. కేబినెట్‌ భేటీలో ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు, రూ. 19 వేల కోట్ల పెట్టుబడుల పరిశ్రమల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేయనుంది. అదే విధంగా సమగ్ర కుల గణనకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీని వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం నెరవేర్చనుంది. రాష్ట్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీపై మంత్రిమండ‌లి చర్చించనుంది. 

Back to Top