పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఏలూరులోని జిల్లా ఆస్పత్రిలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేయనున్నారు. శంకుస్థాపన జరిగే స్థలాన్ని మంగళవారం డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, కలెక్టర్ ముత్యాల రాజు పరిశీలించారు.