మహానేత జయంతి రోజునే రైతు దినోత్సవం

తాడేపల్లి: జూలై 8వ తేదీ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వైయస్‌ రాజశేఖరరెడ్డి అన్నదాతల సంక్షేమానికి చేసిన సేవలు, చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా మహానేత జయంతిని ఏటా రైతు దినోత్సవం జరుపుకోనున్నారు. కాగా, వైయస్‌ఆర్‌ జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటించడంపై రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 
 

Back to Top