డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు 

ఈ-కేవైసీ నమోదు ఎప్పుడైనా చేయించుకోవచ్చు

చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

వైయస్‌ఆర్‌ జిల్లా: ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారని డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఈ-కేవైసీ నమోదు చేయించకపోతే కార్డులు తొలగిస్తారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. కడపలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ-కేవైసీ నమోదుపై స్పష్టతనిచ్చారు. ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారంటూ డీలర్లు రేషన్‌ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంటి బిడ్డలతో గంటల తరబడి ఆధార్‌ నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదన్నారు.
ఈ-కేవైసీకి గడువులేదని.. ఎప్ప్పుడైనా చేయించుకోవచ్చన్నారు. దేశ, విదేశాల్లో వున్న వారు ఈ-కేవైసీలు చేయించడానికి పరుగులు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

తాజా వీడియోలు

Back to Top