ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కిందివైయస్ఆర్ సీపీలో చేరిన వెంకట రామచంద్రరావు దంపతులువైయస్ఆర్ సీపీలో చేరిన డాక్టర్ కంచర్ల అచ్యుతరావుఏపీకి ఏం సహాయం చేశారని ఎన్డీఏలో కలుస్తున్నారు? కొలికపూడి ఒక కుసంస్కారిరేపు అధికారంలోకి వచ్చేది మేమే
డీలర్లు రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు
24 Aug 2019 2:23 PM
ఈ-కేవైసీ నమోదు ఎప్పుడైనా చేయించుకోవచ్చు
చీఫ్విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి
వైయస్ఆర్ జిల్లా: ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారని డీలర్లు రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. ఈ-కేవైసీ నమోదు చేయించకపోతే కార్డులు తొలగిస్తారంటూ వస్తున్న వదంతులను ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. కడపలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ-కేవైసీ నమోదుపై స్పష్టతనిచ్చారు. ఈ-కేవైసీ సాకుతో పేర్లు తొలగించారంటూ డీలర్లు రేషన్ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంటి బిడ్డలతో గంటల తరబడి ఆధార్ నమోదు కేంద్రాల వద్ద పడిగాపులు పడాల్సిన అవసరం లేదన్నారు.
ఈ-కేవైసీకి గడువులేదని.. ఎప్ప్పుడైనా చేయించుకోవచ్చన్నారు. దేశ, విదేశాల్లో వున్న వారు ఈ-కేవైసీలు చేయించడానికి పరుగులు పట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ-కేవైసీ సులభతరం చేసేందుకు మరిన్ని ఆధార్ నమోదు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.