మార్చి 12న పార్టీ  పండుగ‌

వైయ‌స్ఆర్‌సీపీ 11వ ఆవిర్భావ దినోత్స‌వ వేడుకల‌కు పార్టీ శ్రేణులు సిద్ధం

ఊరూవాడాల్లో జెండా ఎగుర‌వేద్దాం, మ‌హానేత వైయ‌స్ఆర్‌కు ఘ‌న నివాళుల‌ర్పిద్దాం

అమ‌రావ‌తి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 వసంతాలు పూర్తి చేసుకుని మార్చి 12వ తేదీన 11వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతోంది. ఆ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో, గ్రామగ్రామాన, ప్ర‌తీ పట్టణాల్లోని వార్డుల్లో, న‌గ‌ర కార్పొరేషన్ల పరిధిలోని అన్ని డివిజన్లలో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయ‌స్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో అలంకరించాలని, ఘనంగా వేడుకలు నిర్వహించాలని పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుల చేశారు. ఈ మేర‌కు పార్టీ పండుగ ఘ‌నంగా నిర్వ‌హించేందుకు పార్టీ శ్రేణులు సిద్ధ‌మ‌వుతున్నాయి.

గ‌ర్వంగా త‌లెత్తుకు తిరిగేలా..

 జననేత శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి నేతృత్వంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడచిన పదేళ్ళలో ఎన్నో సవాళ్ళను అధిగమించి సంపూర్ణ ప్రజా బలంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.      అధికారం చేపట్టిన 20నెలల అతి స్వల్ప కాలంలోనే పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీల్లో 90 శాతాన్ని మన పార్టీ అధ్యక్షులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు పూర్తి చేసి దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా నిలిచారు.

మేనిఫెస్టోలో చెప్పిన వాటినే కాకుండా చెప్పని వాటిని కూడా శ్రీ వైఎస్ జగన్ గారు అమలు పరుస్తూ... మన పార్టీ పట్ల ప్రజల్లో మరింత గౌరవాన్ని పెంచుతూ... మనం గర్వంగా తలెత్తుకు తిరిగేలా తిరుగులేని పాలన అందిస్తున్నారు.  అందుకు తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే తగిన ఉదాహరణ. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందన్న వాస్తవం మీ అందరికీ తెలిసిందే.   ఈ క్రమంలో వచ్చిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కలిసి ఒక పండుగలా జరుపుకోవాల్సిన అవసరం ఉంది. 

Back to Top