రాష్ట్ర‌వ్యాప్తంగా పింఛన్ల పండగ.. 

తెల్లవారుజాము నుంచే పెన్షన్ల పంపిణీ
 

అమరావతి : రాష్ట్రవ్యాప్తంగా గురువారం తెల్లవారు జాము నుంచి అవ్వాతాతలు, వితంతు, దివ్యాంగులతో పాటు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు  వైయ‌స్ఆర్  పెన్షన్‌ కానుక పంపిణీ కొనసాగుతుంది. ఇందుకోసం రూ.1,584.87 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. గ్రామ, వార్డు సచివాలయాల వారీగా ఆ ప్రాంతంలోని లబ్ధిదారుల సంఖ్య ఆధారంగా పింఛన్‌ డబ్బును ప్రభుత్వం.. ఆయా సచివాలయాల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది.

తెల్లవారుజాము నుంచే వలంటీర్లు నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్‌ డబ్బులు అందజేస్తున్నారు. ఉదయం 7:30 గంటల వరకు 33.29 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తి చేశారు. 20.74 లక్షల మందికి రూ.527.02 కోట్లు అందజేశారు. సాంకేతిక కారణాలతో ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదనే ఫిర్యాదులు రాకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. పింఛన్ల పంపిణీని ఐదు రోజుల్లోగా నూరు శాతం పూర్తి చేయాలని ఆదేశించినట్లు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. 

Back to Top