హైదరాబాద్: తెలుగుదేశం పరిపాలన నిజ స్వరూపం అందరకిీ బట్టబయలు అవుతోంది. కాల్ మనీ సెక్సు రాకెట్ కేసు సాక్షిగా ఈ సంగతి మరోసారి బయట పడింది.<br/><strong>నిందితులకు బెయిలు</strong>రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ సెక్సు రాకెట్ కేసు సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. వడ్డీ కి డబ్బులు ఇచ్చి, తిరిగి తీర్చలేని స్థితిలో ఉన్న మహిళల్ని వేధించటమే కాల్ మనీ సెక్సురాకెట్ ఉద్దేశ్యం. బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపి మహిళల జీవితాల్ని నాశనం చేయటంతో వందల కుటుంబాలు సర్వనాశనం అయిపోయాయి. అయితే ఇంతటి ఘోరమైన కేసులో ఇరుక్కొన్నవారంతా తెలుగుదేశం నాయకుల అనుచరులు కావటం గమనార్హం. దీంతో కేసు వెలికి తీసినంత వేగంగా తదుపరి చర్యలు లేకుండా పోయాయి. నిందితులు యలమంచిలి రాము, భవానీ శంకర్, దూడల రాజేష్ లకు బెయిల్ వచ్చేసింది. బెయిల్ ఇచ్చినది గౌరవ న్యాయస్థానమే అయినప్పటికీ, అక్కడ బెయిల్ వద్దని బలంగా వాదించాల్సింది ప్రభుత్వ పక్షమే. దీంతో పోలీసులు, ప్రాసిక్యూటర్ ల మీద తెలుగుదేశం ఒత్తిడి ఫలించటంతో నిందితులు బెయిల్ మీద బయటకు వచ్చేశారు. దీన్ని బట్టి కేసు భవిష్యత్ ఎలా ఉంటుందనేది తేలిగ్గా చెప్పగలుగుతాం.<br/><strong>పోరాడినందుకు జెయిలు</strong>కాల్ మనీ సెక్సు రాకెట్ మీద పోరాడిన ప్రతిపక్ష ఎమ్మెల్యేల మీద ప్రభుత్వం కక్ష పెట్టుకొంది. అందుకే అవకాశం కోసం ఎదురు చూసి మరీ కక్ష తీర్చుకొంటోంది. ప్రజల్లో చురుకైన నేతగా పేరు తెచ్చుకొన్న మిథున్ రెడ్డి పేరు తెచ్చుకొన్నారు. ప్రజా క్షేత్రంలో ఉంటూ తెలుగుదేశం అరాచకాలమీద పోరాడుతున్నారు. ఆధారం లేని కేసును ప్రాతిపదికగా చేసుకొని ఆయన మీద కేసు పెట్టి అరెస్టు చేయించారు. అటు ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లను కూడా కేసులు తవ్వి తీసి అరెస్టు చేయించారు. <br/>దీన్ని బట్టి తెలుగుదేశం ప్రభుత్వ వ్యవహార శైలి స్పష్టంగా అర్థం అవుతోంది. సెక్సు రాకెట్ వంటి ఘోరమైన నేరాలకు పాల్పడిన వారిని అందలం ఎక్కిస్తోంది. అటు, ఈ సెక్సు రాకెట్ మీద పోరాడినందుకు వైఎస్సార్సీపీ నాయకుల్ని అరెస్టులు చేయిస్తోంది. అంటే సామాన్య ప్రజల్ని కాల్చుకొని తినటం గొప్ప విషయంగానూ, సామాన్యుల తరపున నిలబడటం గిట్టని విషయంగానూ మారిందన్న మాట