వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుప్రజల గుండె చప్పుడు.నిన్న జరిగిన ఉప ఎన్నికలు మిని సార్వత్రిక ఎన్నికలుగా జరిగాయి.. చెదురుమదు ఘటనలు ఉన్నప్పటికి ప్రశాంతంగా జరిగాయి అది టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు పని గట్టుకుని చేసిన అల్లర్లే, పోలీంగ్ శాతం పెరిగంది. పోలీంగ్ శాతం ఎందుకు పెరుగుతుంది అంటే ప్రభుత్వ వ్యతిరేకత లేదా బలమైన కారణం ఉంటేనే పోలీంగ్శాతం పెరిగింది. ఈ ఎన్నికలు ప్రజలకు ప్రజావ్యతిరేకులక తప్పా సాధారణ ఎన్నికలు కాదు. రైతాంగ సమస్యలు మీద పదవులుపోగుట్టుకున్న ఎమ్మెల్యకి రైతులు మద్దతు పలికారు. వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుప్రజల గుండె చప్పుడు. కొంత మంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ సెంటిమెంట్ పండిందిఅని జగన్గారిని అరెస్ట్ చేశారని, విజయమ్మగారు, షర్మిలగారు ప్రచారం చేసేరని అందుకే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపోందుతుందని అంటున్నారు తెలుగుదేశం కాంగ్రెస్ పరోక్షంగా తమ ఓటమిని అంగీకరించాయి. లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ వైయస్ ఆర్ కాంగ్రెస్ తమ దగ్గర ఉన్న అస్త్రాలు అన్ని ప్రయోగించింది వారి దగ్గర అస్త్రాలు లేవు తర్వాత కాంగ్రెస్దే భవిష్యత్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మేము ఒకటే సవాలు చేస్తున్నాం మీరు మీ పార్లమెంట్ సీటుకి రాజీనామా చేస్తే దాన్నికూడ మేమే గెలుచుకుంటాం లేదా నేనే రాజకీయాలనుండి తప్పుకుంటా........ సింపతి ఎల్లాకాలం ఉండదు అంటున్నారు అసలు సింపతి పోందడానికి ఒక అర్హత ఉండాలి. సింపతి ఉంటే చంద్రబాబు నాయుడు అలిపిరిలో జరిగిన సంఘటన తర్వాత ఎన్నికలు పెడితే ఎందుకు గెలవలేదు అటాగే రాజశేఖరరెడ్డిగారు మరణిస్తే అంతమంది ఎందుకు మరణించారు.. నీతికి అవినీతికి ప్రచారం అని చేసిన టీడీపీ కాంగ్రెస్ నాయకులు రేపు మేము అన్ని స్ధానాల్లో గెలిస్తే మీరు అవనీతి పరులు అని ఒప్పుకుంటారా... స్యయంగా ఓటర్లుదగ్గరకి వెళ్ళి 3వేలరూపాయలు వైయస్ ఆర్ కాంగ్రెస్కి ఓట్లువేయవద్దు అని చెప్పి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు ఇద్దరు కుమ్మకై ఓటర్లును ప్రభావితంచేశారు. కొన్ని చోట్ల బలహీనవర్గాల ఓట్లను తొలగించారు. టీడీపీ కాంగ్రెస్ లు రెంటు పార్టీలే ఉండాలి అని జగన్మోహన్రెడ్డిని అణగదోక్కడానికి ప్రయత్నం చేస్తే మూడో పార్టీ కావలని ప్రజలు కోరుకుంటున్నారు, రిజల్ట్ అదే పద్దతిలో రాబోతుంది.