విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం వెంకట బైరిపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా స్థానికులు జననేతకు ఘన స్వాగతం పలికారు. స్థానికులు పెద్ద ఎత్తున వైయస్ జగన్ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. పంట కాల్వలకు మరమ్మతులు చేయించడం లేదని రైతులు ప్రతిపక్ష నేతకు ఫిర్యాదు చేశారు.