ప్రజా సంకల్ప యాత్ర 304వ రోజు షెడ్యూల్‌




విజయనగరం: రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్న చంద్రబాబు పాలనను తుదముట్టించేందుకు, ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 304వ రోజు షెడ్యూల్‌ ఖరారైంది. రాజన్న బిడ్డ చేపట్టిన పాదయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 304వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. శనివారం ఉదయం కురుపాం నియోజకవర్గంలోని జియ్యమ్మ వలస మండలంలోని బస చేసే ప్రాంతం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి బీజే పురం, గెడ్డ తిరువాడ, ఇటిక వరకు సాగుతుంది. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం కుందర తిరువాడ క్రాస్, చిన్న కుడమ క్రాస్, తిరకనాయుడు వలస వరకు పాదయాత్ర సాగుతుంది.
 
Back to Top