రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ను కలిసిన కోటంక గ్రామ మహిళలు
10 Dec 2017 3:01 PM
అనంతపురం జిల్లా శింగనమల నియోజగకర్గం గార్లదిన్నె మండలం కోటంక గ్రామంలో వైయస్ జగన్కు మహిళలు ఘన స్వాగతం పలికారు. మహిళలు వారి సమస్యలను జననేత దృష్టికి తీసుకెళ్లారు. పింఛన్లు, రేషన్ అందడం లేదని వాపోయారు. చిన్నారులను బడికి పంపితే చదివించే బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇప్పిస్తామని నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన చంద్రబాబు మాటలు నమ్మి ఓటేశామని నిరుద్యోగుల తల్లిందండ్రులు వైయస్ జగన్ ఎదుట వాపోయారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని తమ గోడు వెళ్లోబోసుకున్నారు. మద్యం దుకాణాల వలన తమ కుటుంబాలు చితికిపోతున్నాయని అధికారంలోకి వచ్చిన వెంటనే బెల్టు షాపులను మూయించాలని వైయస్ జగన్కు విజ్ఞప్తి చేశారు. పారిశుద్ధ్య కార్మికులు తమకు వేతనాలు ఇవ్వడం లేదని తెలిపారు. సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఉద్యోగులు తమను క్రమబద్ధీకరించాలని కోరారు. తమ గ్రామం గుండా వైయస్ జగన్ ప్రజా సంకలప్ప యాత్ర చేయడం సంతోషంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు.