మరికొద్ది సేపట్లో బొబ్బిలిలో బహిరంగ సభ


బొబ్బిలిలో వైయస్‌ఆర్‌సీపీ జెండాలు రెపరెపలు..

విజయనగరంః బొబ్బిలి పట్టణం వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలు,జెండాలతో కళకళలాడుతోంది. మరికొద్దిక్షణాల్లో వైయస్‌ జగన్‌ భారీ బహిరంగ సభ జరుగనుంది.ఉదయం నుంచే ప్రజలు నలుమూలల నుంచి సభాస్థలికి చేరుకుంటున్నారు.జననేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రసంగం కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో సమస్యలను ప్రజలు,వైయస్‌ఆర్‌సీపీ నాయకులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్ళారు.ప్రధానంగా చక్కెర కార్మాగారాలు, జూట్‌మిల్లులు, సాగునీరు తదితర అంశాలపై జగన్‌ ప్రస్తావించనున్నారు.దారిపోడవునా వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. విజయనగరంలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో వైయస్‌ గెలుపుజెండా ఎగరవేయబోతుందని వైయస్‌ఆర్‌సీపీ నాయకులు ధీమావ్యక్తం చేశారు.ఇంతటి ప్రజా స్పందన ఏ నాయకుడికి రాలేదని, ఒక వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిమాత్రమే వస్తుందన్నారు. 
Back to Top