స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి
పెన్షన్
వృద్ధాప్యం అనేది భారం కాకుండా ఉండాలనే ఆలోచనతో అర్హులైన అవ్వాతాతలందరికీ క్రమం తప్పకుండా ఫించన్లు అందే ఏర్పాటు చేేశారు. అది కూడా ప్రతినెలా ఒకటి, రెండు తేదీల్లోనే లబ్దిదారులకు అందేలా చర్యలు తీసుకున్నారు.
ఆసరాలేని వృద్ధులు, వైకల్యం శాపంగా పరిణమించిన వారు, ఆర్థిక సాయం ఎదురు చూసేవారికి వైఎస్సార్ అందించిన ఫించన్లు చేయూతనిచ్చాయి. పరిమిత ఫించన్లు, అర్హతలున్నా ఎవరో మరణిస్తే కాని మరొకరికి పింఛను ఇవ్వని దుస్థితి, కేవలం 75 రూపాయిల కోసం ప్రభుత్వాధికారుల చుట్టూ పడిగాపులు పడే పరిస్థితులను వైఎస్సార్ మార్చేసారు. కులమతాల పట్టింపు లేకుండా, పార్టీలకు అతీతంగా అర్హులైన అందరికీ పింఛన్లు అందించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
16లక్షలు మాత్రమే ఉన్న పింఛను వైఎస్ హయాంలో 71లక్షలు అయ్యాయి. అంటే 55లక్షల కొత్త పింఛన్ల మంజూరు జరిగింది. వితంతువులకు, వికలాంగులకు, మనోవైకల్యం ఉన్నవారికి కూడా పింఛన్లు మంజూరు చేసి తన పెద్దమనసును చాటుకున్నారు వైఎస్సార్.