కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పం
07 Jul 2018 3:00 PM
అదే వైయస్ జగన్మోహన్రెడ్డి నడిపిస్తోంది
వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా
తూర్పుగోదావరి: ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్పయాత్ర చేపట్టారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా అన్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనను ఎండగడుతూ.. దాదాపు ఏడు నెలల నుంచి పాదయాత్ర చేస్తున్న జననేతకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తుందన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మూడు వేల కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేపట్టడం సాహసోపేత నిర్ణయమన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి లాంటి గొప్ప పరిపాలనను ప్రజలు మరోసారి వైయస్ జగన్ నాయకత్వంలో మాత్రమే చూడగలరన్నారు. ఆ నమ్మకం ప్రజల్లో ఉండబట్టే ఆయన అడుగులో అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నారన్నారు. వైయస్ జగన్ రాష్ట్రానికి కాబోయే సీఎం అని ధీమా వ్యక్తం చేశారు.