మృతదేహాలతో వైఎస్సార్సీపీ కార్యకర్తల ఆందోళన

పులివెందుల:
 బెంగళూరులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన
ఘటనపై వైఎస్సార్ జిల్లాలో పార్టీ శ్రేణులు, బంధువులు ఆందోళనకు దిగారు.
కార్యకర్తల మృతదేహాలతో జిల్లాలోని తొండూరు పోలీస్ స్టేషన్ ఎదుట
బైఠాయించారు. నలుగురి మృతికి కారణమైన కొండాపురం సీఐ రవిబాబుపై వెంటనే
చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎంపీ
వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిలతో పాటు భారీ
సంఖ్యలో కార్యకర్తలు, మృతుల బంధువులు పాల్గొన్నారు.
Back to Top