టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
చేతులు జోడించి సహకరించాలని కోరాం
20 Mar 2018 12:57 PM
ఢిల్లీ: ఐదు కోట్ల ఆంధ్రప్రజల సమస్యపై లోక్సభలో మాట్లాడేందుకు సహకరించండి అని టీఆర్ఎస్, ఏఐడీఎంకే సభ్యులను చేతులు జోడించి నమస్కరించి కోరడం జరిగిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లోక్సభ వాయిదా అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. స్పీకర్ అవిశ్వాస తీర్మానం చదివినప్పుడు రెండు నిమిషాలు సహకరించాలని సభ్యులను కోరడం జరిగిందన్నారు. సభ్యులు సహకరించకపోవడంతో సభ వాయిదా పడిందన్నారు. అయినా హోదా పోరాటం ఆగదన్నారు. మూడోసారి కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందన్నారు.