పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్ కె రోజా మంత్రి పీతల సుజాతపై నిప్పులు చెరిగారు. పీతల సుజాతకు వడ్డాణాలు, డబ్బులపై ఉన్న ఆసక్తి ప్రజాసమస్యలపై లేదని విమర్శించారు. పీతల సుజాతకు చంద్రబాబు భజన చేయడం తప్ప నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి లేదని రోజా ఫైరయ్యారు. <br/>చంద్రబాబు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కరవు దాపరిస్తోందని రోజా ధ్వజమెత్తారు. వైఎస్ఆర్ హయాంలో ప్రతి ఇంటా సౌభాగ్యం వెల్లు విరిసేదని..కానీ, చంద్రబాబు హయాంలో దౌర్బాగ్యంగా ఉందని దుయ్యబట్టారు. ఆంధ్రప్రదేశ్ ను కరవు రహిత రాష్ట్రంగా మార్చడం ఒక్క వైఎస్ జగన్ తోనే సాధ్యమని ...పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజిగూడెంలో జరిగిన సభలో రోజా తేల్చిచెప్పారు.