కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
సిట్పై నమ్మకంపై లేదు..స్వతంత్ర సంస్థచే విచారణ జరిపించాలి
13 Nov 2018 11:45 AM
న్యూఢిల్లీః చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడు కాదని వైయస్ఆర్సీపీ సీనియర్ నేత వరప్రసాద్ అన్నారు. ఒక ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే కనీసం పరామర్శించలేదని, కనీసం ఖండన కూడా తెలపలేదని విమర్శించారు. వైయస్ జగన్పై హత్యాయత్నం వెనుక టీడీపీ పెద్ద తలకాయలు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. హత్యాయత్నం జరిగిందని రిమాండ్ రిపోర్టు తేటతెల్లం చేసిందన్నారు. విచారణను నీరుగారుస్తూ కేసును పక్కదారి పట్టిసున్నారని విమర్శించారు. వైయస్ జగన్ను వాడూవీడూ అంటూ గౌరవం లేకుండా మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదన్నారు. టీడీపీ నాయకులు రౌడీలా ప్రవర్తిస్తున్నారని,.హంతకులు మాట్లాడినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. సిట్పై నమ్మకం లేదని కేంద్ర ప్రభుత్వం తరపున స్వతంత్ర సంస్థచే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.