విజయవాడః స్వరాజ్య మైదానం ప్రజల ఆస్తి అని వైయస్ఆర్సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. స్వరాజ్య మైదానాన్ని టీడీపీ అనుకూల కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ప్రభుత్వం బరితెగించిందని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్ట్ కా్రంటాక్టర్ శీనయ్య కోసం ఇదంతా చేశారని ఆరోపించారు. కాంట్రాక్టర్కు రూ.400 కోట్లు ధారాదత్తం చేసేందుకు కుట్ర జరుగుతుందన్నారు. స్వరాజ్య మైదానంపై ఇద్దరు సీఎస్లు హైకోర్టుకు వెళ్దాం అన్నా చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదంటూ ప్రశ్నించారు.