నేడు గ‌వ‌ర్న‌ర్‌తో వైయ‌స్ జ‌గ‌న్ భేటీ

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేటి సాయంత్రం గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌ను క‌ల‌వ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా పెద్ద‌నోట్ల ర‌ద్దు కార‌ణంగా సామాన్య ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను వివ‌రించానున్నారు. రూ.500లు, రూ.1000ల ర‌ద్దు కార‌ణంగా  రైతులు,  చిరు వ్యాపారులు, కూలీలు క్షేత్రస్థాయిలో  పడుతున్న అగచాట్లను గ‌వ‌ర్న‌ర్ దృష్టికి తెచ్చి ప్ర‌భుత్వాల‌పై ఒత్తిడి తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేయ‌నున్నారు.

Back to Top