హైదరాబాద్: ఈనెల 3 నుంచి 5వరకు మెదక్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టనున్న పరామర్శయాత్రకు సంబంధించి వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాష్ ప్రచార పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈసందర్భంగా నల్లా సూర్యప్రకాష్ మాట్లాడుతూ....మెదక్ జిల్లాలోని గజ్వేల్ నుంచి షర్మిల పరామర్శయాత్ర మొదలవుతుందని చెప్పారు. <br/>దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మొత్తం 13మంది మరణించారు. చనిపోయిన కుటుంబసభ్యులను పరామర్శించి షర్మిల వారిలో ధైర్యం నింపుతారు. పటాన్ చెరువు మినహా జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో వైఎస్ షర్మిల పర్యటిస్తారని నల్లా సూర్యప్రకాష్ తెలిపారు. చివరి రోజున నారాయణఖేడ్ లో నిర్వహిస్తున్న భారీ బహిరంగలో ప్రజలనుద్దేశించి వైఎస్ షర్మిల ప్రసంగించనున్నట్లు వెల్లడించారు.<br/>పార్టీ శ్రేణులంతా పరామర్శ యాత్రలో పాల్గొని జయప్రదం చేయాలని నల్లా సూర్యప్రకాశ్ పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు సాయినాథ్రెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు గౌరిరెడ్డి శ్రీధర్రెడ్డి, జిల్లా నాయకులు టి.జగదీశ్వర్ గుప్తా, ఎ.లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.