కర్నూలు: కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేస్తానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 21వ రోజు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఎమ్మిగనూరు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిపక్ష నేత దృష్టికి తీసుకెళ్లారు. ఏళ్ల తరబడి మున్సిపాలిటీలో పనిచేస్తున్నా కనీస వేతనాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు మాట తప్పారని జననేత దృష్టికి తీసుకెళ్లారు. వీరి సమస్యలు విన్న వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు. మరో ఏడాది ఓపిక పట్టండి..ఆ తరువాత మనందరి ప్రభుత్వం వస్తుందని, అందరికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు. వైయస్ జగన్ హామీపై కాంట్రాక్ట్ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు.<br/><strong>జీతాలు అందడం లేదు</strong>తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోనెగండ్ల మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు వైయస్ జగన్కు విన్నవించారు. జీతాలు సకాలంలో అందడం లేదని ఫిర్యాదు చేశారు. రెగ్యులర్ టీచర్లుగా గుర్తించి హెల్త్కార్డులు ఇవ్వాలని కోరారు. కాగా..సీపీఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని యూటీఎఫ్ నాయకులు నరసింహులు, జక్కిరయ్య, మహమ్మద్బాషా తదితరులు వైయస్ జగన్కు వినతిపత్రం ఇచ్చారు.