రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
హనుమంతరావు మృతి..వైయస్ జగన్ సంతాపం
09 Jan 2017 11:24 AM
హైదరాబాద్ : సుప్రసిద్ధ ఇంజినీర్, నీటి పారుదల నిపుణులు టి.హనుమంతరావు మృతిపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర సంతాపం తెలిపారు. హనుమంతరావు తెలుగువారిలో మహా మనుషుల కోవకు చెందినవారని, నీటి పారుదల, నీటి నిల్వ అంశాలమీద తన అభిప్రాయాలను రాగద్వేషాలకు అతీతంగా, నిర్మాణాత్మకంగా చెప్పేవారని అన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీర్ ఇన్ చీఫ్గా, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాదారుగా, ఐక్యరాజ్యసమితి సలహాదారుగా ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైనదని వైయస్ జగన్ అన్నారు. వ్యక్తిగా నిగర్వి, సౌమ్యుడు, పదవీ విరమణ తర్వాత కూడా నిస్వార్థ సేవలందించిన మహానుభావుడని, ఆయన మరణం దేశానికే తీరనిలోటు అని వైయస్ జగన్ తన సతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.