నెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారురెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని విశ్వసిస్తున్నాంబస్సుయాత్రకు జనం జైత్రయాత్ర.
విజయమ్మ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా : శంకర్రావు
27 Aug 2012 5:53 AM
హైదరాబాద్, 27 ఆగస్టు 2012 : 'దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తిరిగివస్తే ఆయన కళ్ళలోకి చూసే ధైర్యం మంత్రులకు ఉందా?' అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేసిన వ్యాఖ్యలతో మాజీ మంత్రి పి. శంకర్రావు ఏకీభవించారు. విజయమ్మ వ్యాఖ్యల్లో వక్రీకరణ లేదు, వ్యంగ్యం లేదని పేర్కొన్నారు. ఒకవేళ అలా ఎవరైనా వైయస్ వైపు చూస్తే బూడిదైపోతారని ఆయన అన్నారు. మరణించిన వారిపై అభియోగాలు మోపడం సరికాదన్నారు. మరణించిన వారిపై అభాండాలు వేయడాన్ని ఏ మతమూ ఒప్పుకోదని, దేవుడు కూడా సహించబోడని ఆయన అన్నారు. మంత్రులు తప్పు చేసి, ఈ నెపాన్ని వైయస్ రాజశేఖరెడ్డిపైకి నెట్టడం సరికాదని శంకర్రావు అన్నారు. వైయస్ను విమర్శిస్తే ప్రజలు సహించబోరని ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ను విమర్శించినందువల్లే కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిందని శంకర్రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ కనువిప్పు కలగటం లేదన్నారు.