స్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషి
వైయస్ఆర్తో బాబుకు పోలికే లేదు: సబ్బం హరి
29 Apr 2013 10:41 AM
విశాఖపట్నం, 29 ఏప్రిల్ 2013: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేసిన ప్రజాప్రస్థానం పాదయాత్రతో చంద్రబాబు చేసిన పాదయాత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, అస్సలు పోలికే లేదని అనకాపల్లి ఎం.పి. సబ్బం హరి వ్యాఖ్యానించారు. మహానేత వైయస్ఆర్ ఉదయం 5 గంటలకే నిద్ర లేచి పద్దతి ప్రకారం ప్రజలతో మమేకమై పాదయాత్ర చేశారని ఆయన గుర్తుచేశారు. మనుషులు తిరగని రాత్రి సమయంలో బాబు చేసిన పాదయాత్రకు వచ్చిన వారంతా తీసుకువచ్చిన జనమే అన్నారు. వాళ్ళలో ఏ ఒక్కరూ చంద్రబాబు మీద అభిమానంతో స్వచ్ఛందంగా వచ్చిన వారు మాత్రం కానే కాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ మినహా ఇతర ఏ పార్టీ సిబిఐని విశ్వసించటం లేదని సబ్బం హరి అన్నారు.