మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నేతన్నను పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం
28 Apr 2017 5:35 PM
ఉరవకొండ: చేనేతల సమస్యలను పరిష్కరించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వైయస్ఆర్ సీపీ చేనేత విభాగం జిల్లా కమీటి సభ్యులు చెంగలమహేశ్వర ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక బళ్ళారి బైపాస్లోని దేవాంగ ఫంక్షన్హాల్లో చెంగల మహేశ్వర ఆధ్వర్యంలో చేనేత సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత అంతటి ప్రాధాన్యత కల్గిన చేనేత పరిశ్రమను ఆదుకోవాలన్న చిత్తశుద్ది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేకుండా పోయిందన్నారు. చేనేత సమస్యల పై దేవాంగులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. కార్మికులకు ఉపాధి లేక ఆకలి చావులకు పాల్పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో చేనేత విభాగం నేతలు తదితరులు పాల్గొన్నారు.