మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఢిల్లీ ధర్నాకు విజయవాడ నుంచి ప్రత్యేక రైలు
02 Mar 2018 11:10 AM
అమరావతి: ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొనే నాయకులు, కార్యకర్తల కోసం విజయవాడ నుండి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన సభ్యులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, ఇతర ముఖ్య నాయకులు శుక్రవారం (2వ తేదీ) సాయంత్రం 7 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకోవాలి. రైలు రాత్రి 10 గంటలకు విజయవాడ నుంచి బయలు దేరుతుంది. 5వ తేదీ ఢిల్లీ ధర్నా కార్యక్రమం ముగిసిన తర్వాత రాత్రి 9 గంటలకు అక్కడి నుండి రైలు తిరిగి బయలుదేరి 7వ తేదీ ఉదయం విజయవాడకు చేరుకుంటుంది. ధర్నా కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం ఢిల్లీలో వసతి ఏర్పాట్లు పూర్తి చేశారు.