అనంతపురం) ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ మూడో రోజు భరోసా యాత్ర మొదలైంది. ఈరోజు పర్యటన ధర్మవరం నియోజక వర్గంలోనే సాగనుంది. మొదటగా పట్టణంలోని పూజారి బాలాజీ, చింతా గోవర్దన్, తుమ్మల వీరారెడ్డి కుటుంబాల్ని ఆయన పరామర్శించనున్నారు. తర్వాత ధర్మవరం మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన బసిరెడ్డిగారి పోతిరెడ్డి కుటుంబాన్ని పలకరిస్తారు. సాయంత్రం బత్తులపల్లి మండలం యర్రాయపల్లి గ్రామానికి చెందిన చాపట్ల నగేష్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టాక సామాన్యుల జీవితాల్ని సమిధలుగా చేసుకొని పరిపాలన సాగిస్తున్నారు. ఈ ప్రభుత్వ వైఫల్యాలతో విరక్తి చెంది ఆత్మహత్య చేసుకొన్న రైతులు, చేనేత కార్మికులు, కార్మికుల కుటుంబాల్ని పరామర్శించేందుకు ప్రతిపక్షనేత వైెఎస్ జగన్ భరోసా యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే.